అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీ అనే ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పేలుడు పదార్థాలు, మూడు నగరాల మ్యాప్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 'అలూమా' అనే సంస్థకు చెందినవారని, దేశంలో పేలుళ్లకు కుట్ర పన్నారని డీఐజీ తెలిపారు. ఈ కేసులో వారి కుటుంబ సభ్యుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఈ ఉగ్రవాదుల వెనుక ఎవరున్నారు?