ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు రానున్నాయి. రూ. 22 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ సిద్ధమైంది. పునరుత్పాదక విద్యుత్తు, బయోమాస్, డేటా సెంటర్లు, పోర్టుల రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టనుంది. త్వరలో విశాఖపట్నంలో జరగనున్న సీసీఐ భాగస్వామ్య సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం, కంపెనీ మధ్య అవగాహన ఒప్పంద కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 77 వేల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.