బోగస్ ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కనీసం ఆధార్ కార్డులు లేకుండా జీతాలు తీసుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాలు కల్పించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జీతాలు తీసుకున్న ఉద్యోగులను గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు.