తెలంగాణలో ఒంటిపూట బడులు, వేసవి సెలవులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు మొదలుపెట్టాలని నిర్ణయించింది. అదే సమయంలో ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ఇక రంజాన్ సందర్భంగా పాఠశాల తరగతుల సమయాల్లో మార్పులు చేసింది.