సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, ఇంద్రేశం గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చడానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఈ ప్రాంతాలు పారిశ్రామికాభివృద్ధి, జనాభా పెరుగుదల కారణంగా మున్సిపల్ హోదా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ రెండు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పన, నిధుల కేటాయింపులు పెరుగుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.