తెలంగాణలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 4090 ఎంబీబీఎస్ సీట్లు యథావిధిగా కొనసాగనున్నాయి. ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎన్ఎంసీ ప్రశంసించింది. ప్రమోషన్ల ద్వారా అధ్యాపకుల కొరతను తీర్చడంతో పాటు, బెడ్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే సమస్యలను పరిష్కరించుకోవాలని ఎన్ఎంసీ సూచించింది. అదేవిధంగా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించేందుకు కాళోజి హెల్త్ యూనివర్సిటీ సిద్ధమవుతోంది.