తెలంగాణలోని అన్ని తండాల్లో బీటీ రోడ్లు నిర్మించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. తండాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని ఇక నుంచి రోడ్డు లేని తండా ఉండకూడదని అన్నారు. ఇక లంబాడా యువత గొప్పగా చదివి అనుకున్న రంగంలో రాణించాలని సూచించారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన.. తండాలకు తీపి కబురు చెప్పారు.