తెలంగాణలో కొత్తగా మరో విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు మైనింగ్ కళాశాలను ఉన్నతీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి వర్సిటీ ఏర్పాటు కానుంది.