CII Summit 2025 Raymond Group: విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ సదస్సులో ఆంధ్రప్రదేశ్ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. దీనిలో భాగంగా.. దేశీయంగా ప్రముఖ కంపెనీ అయిన రేమండ్ గ్రూప్.. రాయలసీమలో రూ.1201 కోట్లతో మూడు కీలక ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. ఆటో, అపారెల్, ఏరోస్పేస్ వంటి మూడు రంగాల్లో ఈ పెట్టుబడులు రాబోతున్నాయి. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 2027 నాటికి ఈ మూడు ప్రాజెక్టులు పూర్తి అవుతాయని తెలిపారు. ఆ వివరాలు..