తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అన్ని రంగాల్లోనూ వారిని అగ్రస్థానంలో నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఆర్టీసీలో 1000 బస్సులకు మహిళలే యజమానులుగా ఉన్నారన్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని పథకాలు మహిళల పేరుతోనే ఉంటాయని.. రానున్న రోజుల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు.