బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట నూతన సర్పంచులు, వార్డు మెంబర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. వాటికి వెరవకూడదు. తిరిగి మన ప్రభుత్వమే వస్తుంది’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పల్లెలకు మంచి రోజులు వస్తాయని, అప్పటివరకు ప్రజలు అధైర్య పడొద్దని సూచించారు. ఎవరో ఏదో చేస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావొద్దని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.