Trolling on Mynampally Rohit Rao: మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు ఘోర అవమానం జరిగింది. రెండు రోజుల క్రితం (నవంబర్ 05న) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కులగణనకు సంబంధించిన సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. రాహుల్ గాంధీ కాన్వాయ్తో పాటు వెళ్లేందుకు రోహిత్ రావు కారును పోలీసులు అనుమతించలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.