ఉపాధ్యాయుడిగా రిటైర్ అయి 20 ఏళ్లు కావొస్తున్న ఇంకా సర్కార్ బడిలో పాఠాలు చెబుతూనే ఉన్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన బాల్ రెడ్డి మాస్టారు. 79 ఏళ్ల వయసులో ఎలాంటి అలసట లేకుండా ప్రతి రోజూ 15 కి.మీ సొంత ఖర్చుతో ప్రయాణించి మరీ పాఠాలు బోధిస్తున్నారు. సర్కార్ బడిలో పేద విద్యార్థులే వస్తారని.. అందుకే వారికి ఉచితంగా పాఠాలు చెబుతున్నాని చెబుతున్న బాల్ రెడ్డి మాస్టారూ ఎందరికో ఆదర్శం.