తెలంగాణలోని ప్రతీ కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా చాలా మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదటి ఫేస్లో ఇళ్లను కేటాయించిన ప్రభుత్వం.. త్వరలోనే రెండో ఫేస్లో ఇళ్లను కేటాయించనుంది. అయితే.. వీటితో పాటు.. ప్రభుత్వం టౌన్ షిప్స్లల్లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లను వేలం వేసేందుకు సిద్ధం అయింది. ఇక్కడ సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ కేవలం రూ.13 లక్షలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది.