అంబర్పేట, డీడీ నగర్ కాలనీలో కలకలం సృష్టించిన కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేటు చేసుకుంది. భార్య నుంచి విడిపోయి రెండో వివాహం చేసుకున్న వ్యక్తిని, ఆస్తి కోసం మొదటి భార్య కిడ్నాప్ చేయించింది. అతడు బంజారాహిల్స్లో రూ.16 కోట్ల విలువైన స్థలాన్ని అమ్మిన విషయం మొదటి భార్యకు తెలిసింది. ఆ డబ్బు కొట్టేయడానికి ఆమె పథకం పన్నింది. కిడ్నాప్ కోసం కోటిన్నర సుపారీ ఇచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి, నిందితురాలైన మొదటి భార్యతో పాటు ఆమెకు సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.