తీర్థయాత్రలకు వెళ్లాలనుకునేవారికి ఐఆర్సీటీసీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. సికింద్రాబాద్, విజయవాడ మీదుగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఏర్పాటు చేసింది. అక్టోబర్ 24వ తేదీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈ రైలు బయల్దేరుతుంది. పది పగళ్లు, తొమ్మిది రాత్రుల ప్రయాణం సాగుతుంది. ప్యాకేజీలో భాగంగా అయోధ్య, కాశీ, కోణార్క్ వంటి దేవాలయాల సందర్శన ఉంటుంది. దీనికి సంబంధించి ఐఆర్సీటీసీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.