హైదరాబాద్లో రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి గ్రేటర్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 1 నుంచి ఆరు ప్రధాన మార్గాల్లో నైట్ షిఫ్ట్ ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. అందుకు సంబంధించిన షెడ్యూల్, టైం టేబుల్ విడుదలైంది. కోఠి, అఫ్జల్గంజ్, సికింద్రాబాద్, హయత్నగర్, బాచుపల్లి, కొండాపూర్ ప్రాంతాలను కలుపుతూ పటాన్చెరు, వేవ్రాక్ తదితర ప్రాంతాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఐటీ ఉద్యోగులు, నైట్ షిఫ్ట్ సిబ్బంది, ఇతర ప్రయాణికులకు ఈ సేవలు ఉపయోగకరంగా ఉండనున్నాయి.