పొగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీలో సైబరాబాద్ పోలీసులు సత్తా చాటారు. నెల రోజుల వ్యవధిలోనే 1190 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. వాటి విలువ దాదాపు రూ.2.55 కోట్లు ఉంటుందని అంచనా. ఈ మేరకు శుక్రవారం బాధితులకు ఫోన్లు అందించగా.. పోలీసులకు వారు కృతజ్ఞతలు చెప్పారు.