రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రైతు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. ఇక రైతు భరోసా పంట పెట్టుబడి సాయం రూ. 12 వేలకు పెంచటంతో పాటుగా.. 52.09 లక్షల మంది రైతులకు రూ.4,166.21 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. మిగిలిన రైతులకు కూడా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.