రూ.5లక్షలు డిమాండ్ చేశాడు.. 2 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌

10 months ago 15
రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ ఫుడ్‌కోర్టు వ్యాపారిని బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ చేయగా, రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఫుడ్‌కోర్టులో అక్రమాలు ఉన్నాయని బెదిరించినట్లు వ్యాపారి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. గతంలోనూ రవికుమార్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, సరైన ఆధారాలు లేక విచారణ జరుపుతున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. రవికుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Read Entire Article