శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో కొత్త ఫైవ్స్టార్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయి. ఒబెరాయ్ గ్రూపు 3.63 ఎకరాల్లో రూ.532 కోట్లతో, వెంకటేశ్వర హోటల్స్ ఎకరంలో రూ.102 కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ప్రస్తుతం విమానాశ్రయం సమీపంలో నోవోటెల్ ప్రధాన హోటల్గా ఉంది. కొత్త పరిశ్రమలు, ఐటీ, ఏరోస్పేస్, రక్షణ రంగ సంస్థల రాకతో బిజినెస్ ప్రయాణికుల సంఖ్య పెరగనుంది. భవిష్యత్తులో పర్యాటకుల రాక కూడా పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో తుక్కుగూడ హార్డ్వేర్ పార్క్-3లో హోటళ్లకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది.