నిజామాబాద్ జిల్లాలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. తాండూరు గ్రామంలో చాకలి జమున అనే మహిళను ఆమె కుమారుడు రాజు దారుణంగా హత్య చేశాడు. ఆస్తి కోసం కన్నతల్లిని చంపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాద బీమా డబ్బు కోసమే రాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. ఈ కేసును పోలీసులు తిరిగి దర్యాప్తు చేస్తున్నారు.