రెండు గ్రామాల్లో ఓటేసిన వృద్ధురాలు.. ఒక్క ఓటుతో గెలిచిన సర్పంచ్, కోర్టు నోటీసులతో ఆత్మహత్య

1 month ago 5
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చింది. ఆమె రెండు చోట్ల ఓటరుగా నమోదు అయింది. దీంతో రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల ఓటు వేసింది. అయితే ఓ గ్రామంలో ఒక్క ఓటు తేడాతోనే సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయాడు. దీంతో అధికారులపై, రెండుసార్లు ఓటేసిన మహిళపై కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో కోర్టు నోటీసులు జారీ చేయడంతో భయపడిన వృద్ధురాలు.. కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Read Entire Article