రెండు నెలల కిందే పెళ్లి.. సంక్రాంతికి ముందు అదృశ్యం.. కట్ చేస్తే, మహబూబాబాద్ లాడ్జిలో!?

1 year ago 12
అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు నెలల కిందట పెళ్లి చేసుకున్న నవ వరుడు.. తెలంగాణలో శవమై తేలాడు. నర్సీపట్నం రజక కాలనీకి చెందిన పవన్ ప్రేమ్‌కుమార్.. మహబూబాబాద్‌లోని ఓ లాడ్జిలో శవమై కనిపించాడు. అక్కడి పోలీసులు.. ప్రేమ్ కుమార్ తల్లికి సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ ఉందని చెప్పి ప్రేమ్ కుమార్.. లాడ్జీలో రూమ్ తీసుకున్నారు. మరోవైపు ప్రేమ్ కుమార్‌కు రెండు నెలల కిందటే ప్రేమించిన యువతితో వివాహం జరిగింది. అయితే సంక్రాంతి పండుగకు ముందు ప్రేమ్ కుమార్ ఇంటి నుంచి వచ్చేసినట్లు తెలిసింది.
Read Entire Article