ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధునాతన వైద్య పరికరాలు, రోడ్ల నిర్మాణం, సమన్వయ కమిటీ ఏర్పాటుతో పాటు, రాష్ట్రంలోని ఇతర నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు.