ఆ కాలనీ వాసలు రెండేళ్లుగా నిత్య నరకం అనుభవిస్తున్నారు. ఏదో మేలు చేద్దామంటూ మొదలుపెట్టిన పనులను అది చేయకపోగా.. అర్ధాంతరంగా ఆపేయటంతో ఉన్న సమస్యలకు తోడు మరిన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. దీంతో.. ఆ ఏరియా కార్పోరేటర్కు తమ సమస్య విన్నవించుకుందామంటే.. రెండేళ్లుగా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. కార్పొరేటర్తో పని కావట్లేదని.. మరో నేత దగ్గరికి వెళ్తే.. రెండేళ్లుగా వేధిస్తున్న సమస్యను ఒకే రోజులో పరిష్కారం చేపించారు.