Indiramma Houses Second Phase: తెలంగాణలో ఇళ్లు లేని పేదలందరికీ సొంతిళ్లు కట్టించి ఇవ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోంది. ఇప్పటికే 4 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి.. గృహ ప్రవేశాలు చేయిస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అలానే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కీలక ప్రకటన చేశారు. మధ్యతరగతి వారికి కూడా ఇళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.