ఏపీ అక్షరాస్యత రేటు విషయంలో ప్రభుత్వ తీరుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. 2026 ఏడాది ఇంకా పూర్తికాకుండానే.. ఈ ఏడాది అక్షరాస్యతకు సంబంధించి అధికారిక గణాంకాలు ఏవీ విడుదల కాకుండానే ప్రభుత్వం 82.1 శాతం అక్షరాస్యత రేటు అని ఎలా చెప్తుందని జగన్ ప్రశ్నించారు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించే బదులు.. మంత్రి నారా లోకేష్ తన శాఖపై దృష్టి పెట్టాలని సూచించారు.