ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరగనుంది. ఉద్యోగుల డీఏ సమస్యలు, కమిటీ నివేదిక, రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనపై నిర్ణయాలు తీసుకుంటారు. హ్యామ్ మోడల్లో 12,000 కి.మీ. రోడ్ల అభివృద్ధి ప్రణాళికకు ఆమోదం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికలు, వానాకాలం పంటల సాగు సన్నద్ధత వంటి కీలక అంశాలపై కూడా చర్చ జరుగుతుంది.