తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రేపట్నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.