తెలంగాణ టూరిజం శాఖ హెలికాప్టర్ టూరిజాన్ని రేపట్నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్ నుంచి సోమశిల, కృష్ణా అందాలతోపాటు శ్రీశైలం దర్శనం కల్పించి తిరిగి తీసుకురానుంది. ఈ రెండు రోజుల ప్యాకేజీలో ఒక్కొక్కరికీ టికెట్ ధరను రూ.1.40 లక్షలుగా నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో రవాణాతోపాటు బస, భోజనం వంటి అన్ని సౌకర్యాలను కల్పించనుంది.