రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా.. ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటు.. తిరుమల తరహా యాదాద్రి బోర్డు ఏర్పాటు.. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టే బిల్లులకు అసెంబ్లీ ఆమోదించనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.