ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించనుంది. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రులు సమావేశం కానున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ భేటీ కానున్నారు. ఈ భేటీలో ఉద్యోగుల డీఏ, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.