కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైఎస్సార్ సీపీ - టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం.. అదే సమయంలో ఎమ్మెల్యే విరూపాక్షి ఆ ప్రదేశంలో ఉండటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కర్నూలు సబ్ జైలులో ఉన్న విరూపాక్షిని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అక్కడికి చేరుకోనున్నారు.