రేపు భారత్ బంద్.. మావోయిస్టుల పిలుపు..

3 months ago 13
అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టు పార్టీ నవంబర్ 23న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ఎన్‌కౌంటర్లు బూటకమంటూ అభయ్ పేరుతో లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక మావోయిస్టు పార్టీ భారత్ బంద్ నేపథ్యంలో ఏపీలో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులను మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే సూచించారు.
Read Entire Article