విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఏడాది 11 రోజుల పాటు జరుగుతోన్న ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరి రోజు రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అయితే, కృష్ణా నదికి భారీ వరద కారణంగా ఈ ఏడాది తెప్పోత్సవం రద్దైంది. ఇలా జరగం వరుసగా మూడోసారి. మరోవైపు, ఈసారి భక్తులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. ఇప్పటికే 11 లక్షల మందికి పైగా దర్శించుకున్నారు. మొత్తం 18 లక్షల మందికి పైగా వస్తారని అంచనా.