తెలంగాణలో జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని బీజేపీ నేత రఘునందన్ రావు తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రెస్మీట్లు.. కేసీఆర్ ఏపీలో వెళ్లి బీఆర్ఎస్ సభలు పెట్టుకోవచ్చు గానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో సభ పెట్టుకోవద్దా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్లకు ఒక రూల్.. పవన్ కళ్యాణ్కు మరో రూల్ ఉంటుందా అని నిలదీశారు.