తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిసింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ.. ముగ్గురికి ఛాన్స్ దక్కనుంది. అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనూహ్యంగా మంత్రి పదవి రేసులోకి వచ్చారు. ఎవరూ ఉహించని విధంగా ఆయన పేరు తెరపైకి రాగా.. ఇవాళ ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది.