తెలంగాణ అసెంబ్లీలో జరిగిన వ్యవహారంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు.. సరిగా లేదని సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఒకటేనని బండి సంజయ్ ఆరోపించారు. వీరిద్దరి పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావుకు సూచించారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఎప్పటికీ ఉండదని బండి సంజయ్ కొట్టిపారేశారు.