తెలంగాణ ప్రభుత్వం హెచ్ఐవీ బాధితులకు ఊరటనిచ్చే విషయం చెప్పింది. కొత్తగా 14,084 మంది హెచ్ఐవీ బాధితులకు చేయూత పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రి సీతక్క ఫైల్పై సంతకం చేశారు. ఈ నెల నుంచే వీరికి నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్ అందనుంది. 2022 ఆగస్టు తర్వాత నిలిచిపోయిన ఈ పెన్షన్ల మంజూరును బాధితుల విజ్ఞప్తి మేరకు పునరుద్ధరించారు.