మేడారం జాతరను శాశ్వతంగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రూ.251 కోట్లు కేటాయించింది. గద్దెల విస్తరణ, రాతి కట్టడాలు, స్వాగత తోరణాలు, రోడ్ల విస్తరణ, జంపన్న వాగు సుందరీకరణ వంటి పనులు చేపట్టనున్నారు. జాతర కోసం సుమారు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు మహా జాతర జరగనుంది.