తెలంగాణలో రైతు భరోసా పథకంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పంటలు పండిస్తున్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందనుంది. దీనివల్ల సుమారు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు కట్ అయ్యే అవకాశం ఉంది. సాగు చేసే రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడం, ప్రభుత్వ ఆర్థిక భారాన్ని తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.