తెలంగాణలో సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సామాజిక భద్రతా పెన్షన్లలో అక్రమాలను అరికట్టేందుకు సోషల్ ఆడిట్ కఠినతరం చేయాలని ఆదేశించింది. పైలట్ ప్రాజెక్టులో 10 శాతం అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు తేలింది. ఈ ఆడిట్ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి.. అర్హులైన పేదలకే లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.