ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమయపాలన, హాజరుపై విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. ముఖ గుర్తింపు హాజరు (FRS) విధానం అమలుతో పాటు, నెల రోజుల పాటు సెలవు లేకుండా గైర్హాజరైన వారిని శాశ్వతంగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీర్ఘకాలికంగా విధులకు హాజరు కాని వారిపైనా చర్యలు తీసుకోనున్నారు.