పదవీ విరమణ చేసిన న్యాయాధికారులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. వయసు 70 ఏళ్లు దాటితే వారి మూల (బేసిక్) పింఛన్పై అదనంగా 15 శాతం చెల్లించాలని ఆదేశిస్తూ సాధారణ పరిపాలనాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ వ్యా్ప్తంగా 300కు పైగా రిటైర్డ్ న్యాయాధికారులకు ప్రయోజనం చేకూరనుంది. సర్కార్ నిర్ణయంపై రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకు ఆర్థిక భరోసాను ఇస్తుందని అంటున్నారు.