తెలంగాణలోని సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజనం వండిపెట్టే కార్మికులకు తీపి కబురు. ఇక నుంచి బిల్లుల కోసం ఎదురుచూడాల్సిన పని లేకుండా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతినెలా ఒకటో తేదీనే అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.