రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల్లో ఒకటైం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణంపై కీలక ముందడుగు పడింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రూ.11,600 కోట్లతో 55 పాఠశాలలు మంజూరు చేస్తున్నట్టుగా జీవో విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఖమ్మంలో మీడియాలతో మాట్లాడారు.