తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డయాలసిస్ రోగులకు శుభవార్త చెప్పింది. కొత్తగా 681 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రి సీతక్క గారు ఆమోదం తెలిపారు. గతంలో 4011 మందికి మాత్రమే పెన్షన్లు అందేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరో 4029 మందికి పెన్షన్లు మంజూరు చేశామని ఆమె అన్నారు. ఆగస్టు నెల నుంచి ఈ పెన్షన్లు వారి ఖాతాల్లో జమ చేయబడతాయి. ఈ నిర్ణయం పట్ల రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.