Telangana Panchayat Raj Promotions: రేవంత్ సర్కార్ తెలంగాణలోని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పదోన్నతులకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు సూపరింటెండెంట్లుగా, అలానే సీనియర్ అసిస్టెంట్లకు కూడా ప్రమోషన్లు కల్పిస్తూ.. రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 130 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు లభించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్, సంబంధిత మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.