పదవీ విరమణ చేసి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిపై వేటు వేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో అవసరమైన వారిని తిరిగి నియమించుకునే ఛాన్స్ ఉంది.